హైదరాబాద్ : పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం చేయడం బాధాకరం అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో ప్రభుత్వం విచారణ చేపడుతుందన్నారు. దోషులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నిమ్స్లో చికిత్స పొందుతున్న ప్రీతికి మెరుగైన వైద్యం అందించాలని నిమ్స్ వైద్యులను ఆదేశించామని, ప్రత్యేక వైద్య బృందం నిరంతరం పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. ప్రీతి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ప్రీతి తల్లిదండ్రులతో మంత్రి హరీశ్రావు మాట్లాడి ధైర్యం చెప్పారు. నిమ్స్ వైద్యులతో గంట గంటకు మాట్లాడుతూ.. ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై మంత్రి హరీశ్రావు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.