హైదరాబాద్: మరికాసేపట్లో మంత్రి హరీశ్ రావు అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. జూబ్లీహిల్స్ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజల అనంతరం హరీశ్ రావు శాసనసభకు చేరుకున్నారు. మంత్రి ప్రశాంత్ రెడ్డితో పాటు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని ఆయన చాంబర్లో కలిశారు. ఆయనకు బడ్జెట్ ప్రతులను అందజేశారు. అనంతరం అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని మంత్రులు కలిశారు. బడ్జెట్ ప్రతిని స్పీకర్కు అందజేశారు. ఉదయం 10.30 గంటలకు అసెంబ్లీలో మంత్రి హరీశ్ రావు, శాసన మండలిలో మంత్రి ప్రశాంత్ రెడ్డి 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టున్నారు.