సిద్ధిపేట : ఏఎన్ఎం కుటుంబానికి మంత్రి హరీశ్రావు భరోసా కల్పించారు. మద్దూర్ మండలం లదునుర్ గ్రామానికి చెందిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏఏన్ఎంగా విధులు నిర్వహిస్తున్న రామడుగు రేణుక (38) విధులకు బైక్ వెళ్తూ ప్రమాదవశాత్తు ప్రమాదానికి గురై మృతి చెందింది. ఆమె మృతిపై మంత్రి హరీశ్రావు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రేణుక ఏఏన్ఎంగా వైద్యరంగంలో అందించిన సేవలు మరువలేనివని, కరోనా సమయంలో నిత్యం ప్రజల మద్యే ఉంటూ ఆమె అందించిన సేవలను కొనియాడారు.. ఆమె కుటుంబాన్ని అన్నివిధాలా అండగా ఉంటానని, ఆర్థిక సహాయంగా రూ.2లక్షల ప్రకటించారు. వారికి అందించేలా చొరవ చూపాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ ముజామిల్ ఖాన్కు ఆదేశాలించ్చారు. అదేవిధంగా తన భర్త ప్రసాద్ బాబుకి ఆరోగ్య శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగం కల్పిస్తామని, పిల్లలను చదివిస్తామని హామీ ఇచ్చారు.