Minister Harish Rao | మంచిర్యాల : చెన్నూరు( Chennuru ) బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్( Balka Suman )పై రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణ ఉద్యమం( Telangana Movement )లోనే కాదు.. చెన్నూరు నియోజకవర్గం అభివృద్ధిలో కూడా సుమన్ అగ్రభాగాన నిలిచిండు అని హరీశ్రావు కొనియాడారు.
చెన్నూరు నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి హరీశ్రావు.. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే బాల్క సుమన్తో కలిసి రూ. 210 కోట్లతో చేపట్టిన 30 పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా చెన్నూరు పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో హరీశ్రావు పాల్గొని ప్రసంగించారు.
ఒకప్పటి చెన్నూరు.. ఇప్పటి చెన్నూరుకు చాలా తేడా ఉందని హరీశ్రావు స్పష్టం చేశారు. ఇది చెన్నూరులా లేదు.. ఛేంజ్డ్ ఊరు అని చెప్పుకోవాలి. చెన్నూరు అన్ని రకాలుగా అభివృద్ధి చెందింది. ఉస్మానియా యూనివర్సిటీ( Osmania Universuty ) విద్యార్థి నాయకుడిగా ఉన్న సుమన్ పోరాటాన్ని ఉద్యమ సమయంలో దగ్గరుండి చూశాను. నాటి ఉద్యమ స్ఫూర్తిని ఇవాళ చెన్నూరు అభివృద్ధిలో కూడా చూశాను. ఉద్యమంలో సుమన్ నంబర్ వన్నే కాదు.. చెన్నూరు అభివృద్ధిలో కూడా సుమన్ అగ్రభాగాన నిలిచిండు. నాడు ఉద్యమంలో, నేడు చెన్నూరు అభివృద్ధిలో తన చిత్తశుద్ధి, నిజాయితీ కనబడుతుంది. ప్రజలకు సేవ చేయాలను పట్టుదల కనబడుతుంది. ఎదిగిన నాయకుడు, మెదిగిన నాయకుడు. మన ముఖ్యమంత్రి ప్రేమను పొందిన నాయకుడు. ఇలాంటి నాయకుడు మన చెన్నూరుకు ఉండటం మన అదృష్టం. గత ఎన్నికల్లో 28 ఓట్ల వేల మెజార్టీతో సుమన్ను గెలిపించారు. ఇప్పుడు 56 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించాలి. ఇంకా చెన్నూరు బాగా అభివృద్ధి చెందాలంటే సుమన్ను నిండు మనసుతో ఆశీర్వదించాలి అని మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు.
రూ. 2.50 కోట్లతో నిర్మించిన కేసీఆర్ పార్కు, రూ.4 కోట్లతో నిర్మించిన మినీ స్టేడియం, రూ.25 కోట్లతో నిర్మించిన ప్రధాన రహదారి విస్తరణ, రూ.6 కోట్లతో నిర్మించిన పెద్ద చెరువు మినీ ట్యాంక్ బండ్, రూ.3 కోట్లతో నిర్మించిన కుమ్మరికుంట మినీ ట్యాంక్ బండ్, రూ.7 కోట్లతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్ భవనాలను ప్రారంభించారు. రూ. 37 కోట్లతో ఆర్వోబీ, రూ. 22 కోట్లతో వంద పడకల ఆస్పత్రి, రూ. 18 కోట్లతో అద్భుతమైన బట్టర్ ఫ్లై లైట్లు, రూ. 14 కోట్లతో 77 సమ్మక్క సారక్క భవనాలకు శంకుస్థాపనలు చేసుకున్నాం అని హరీశ్రావు తెలిపారు.