జగిత్యాల: భక్తుల కొంగుబంగారం కొండగట్టు అంజన్నను మంత్రి హరీశ్ రావు దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వేకువజామున ఆలయానికి చేరుకున్న మంత్రి హరీశ్ రావుకు అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామివారికి ప్రత్యేకపూజలు చేశారు. పూజానంతరం వేదపండితులు ఆర్థిక మంత్రికి ఆశీర్వచనం అందిచగా, ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. మంత్రి వెంట ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కూడా ఉన్నారు.
కొండగట్టు ఆంజన్న దేవాలయంలో ఆంజనేయస్వామి రెండు ముఖాలతో దర్శనమివ్వటం ప్రత్యేకత. నృసింహస్వామి, ఆంజనేయస్వామి ముఖాలతోపాటు, శంఖు చక్రాలు, హృదయంలో సీతారాములను కలిగి ఉండటం విశేషంగా చెప్పవచ్చు.