సిరిసిల్ల: రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR) రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్నారు. సిరిసిల్ల (Sircilla) పట్టణంలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ పునఃనిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్తో కలిసి ఆలయన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎల్లారెడ్డి మండలం కేంద్రంలో నిర్మిస్తున్న శ్రీ వేణుగోపాలస్వామి ఆలయానికి భూమిపూజ చేస్తారు.
మధ్యాహ్నం 12 గంటలకు సాయిమణి గార్డెన్లో బీఆర్ఎస్ యూత్ నాయకుడు కొర్రీ అనిల్కుమార్ వివాహ వేడుకలకు మంత్రి కేటీఆర్ హాజరవుతారు. మధ్యాహ్నం 12.30 గంటలకు యూత్ నాయకుడు సుధాకర్ ఏర్పాటు చేసిన డయాగ్నోస్టిక్ సెంటర్ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు సిరిసిల్లకు చేరుకుంటారు. మున్నూరుకాపు సంఘ కల్యాణమండపంలో టీఆర్ఎస్వీ నేత శ్రీనివాస్ యాదవ్ వివాహ వేడుకలకు హాజరవుతారు.
మధ్యాహ్నం 1.15 గంటలకు చేనేత వస్త్ర వ్యాపార సం ఘ భవనంలో వస్త్ర వ్యాపార సంఘం నూతన పా లకవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ఎస్పీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, మధ్యాహ్నం 3 గంటలకు తంగళ్లపల్లి మండలం మండెపల్లిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఓల్డ్ ఏజ్ హోమ్ను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి సాయంత్రం హైదరాబాద్కు తిరుగు ప్రయాణ మవుతారు.