గజ్వేల్: సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి హరీశ్రావు సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలో కలియతిరిగి అన్ని విభాగాలను క్షుణ్నంగా పరిశీలించారు. అక్కడ రోగులతో ఆత్మీయంగా మాట్లాడారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు.