సిద్దిపేట : సిద్దిపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ నర్సింగ్ కళాశాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు సోమవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. సిద్దిపేటలో ప్రభుత్వ నర్సింగ్ కాలేజీని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. నర్సింగ్ చేసిన వారికి నూటికి నూరు శాతం ఉద్యోగాలు వస్తాయన్నారు. తెలంగాణలో నర్సుల కొరత చాలా ఉందన్నారు.
కరోనా సమయంలో నర్సులు.. పాజిటివ్ రోగులకు ఎంతో సేవా చేసి, వారి ప్రాణాలను కాపాడారని ప్రశంసించారు. ప్రస్తుతం ప్రారంభించిన నర్సింగ్ కాలేజీలో 400 మంది విద్యార్థులు చదువుకోవచ్చని తెలిపారు. నర్సింగ్ విద్యార్థులకు స్టైఫండ్ కూడా పెంచామని గుర్తు చేశారు. రూ. 33 కోట్లతో నర్సింగ్ కాలేజీకి సంబంధించిన సొంత భవనాన్ని నిర్మిస్తామని మంత్రి హరీశ్రావు తెలిపారు.