హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): అన్ని ఆరోగ్య సూచీల్లో రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానానికి చేర్చాలని, ఇందుకోసం ప్రతి ఒకరు పోటీతత్వంతో పని చేయాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆదేశించారు. సీఎం కేసీఆర్ వైద్యారోగ్యశాఖకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించి, ప్రజారోగ్య సంరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని గుర్తు చేశారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ విభాగం పరిధిలో అమలవుతున్న కార్యక్రమాలపై మంత్రి హరీశ్రావు ఆదివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ..
ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నదని, సిబ్బంది బాధ్యతతో సహకరించాలని కోరారు. సమిష్టి కృషివల్లే ఆరోగ్యరంగంలో దేశంలోనే మూడో స్థానానికి చేరామని, మొదటి స్థానానికి చేరటమే లక్ష్యంగా అన్ని సూచీల్లో పురోగతి నమోదు చేయాలని కోరారు. జిల్లా ప్రజల ఆరోగ్యసంరక్షణ విషయంలో డీఎంహెచ్వోలు, డిప్యూటీ డీఎంహెచ్వోలదే కీలక పాత్ర అని స్పష్టం చేశారు. రోగులు పీహెచ్సీ నుంచి రెఫరల్ దవాఖానకు వెళ్లి చికిత్స చేయించుకొని తిరిగి వెళ్లాక, వారి ఆరోగ్య పరిస్థితిపై మానిటరింగ్ చేయాలని సిబ్బందికి సూచించారు. జిల్లా పరిధిలోనే మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి కాబట్టి, అకడే మంచి వైద్యం అందించాలని, అవసరమైతేనే హైదరాబాద్కు రెఫర్ చేయాలని చెప్పారు.
కార్యక్రమంలో హెల్త్ సెక్రటరీ రిజ్వీ, కుటుంబసంక్షేమ విభాగం కమిషనర్ శ్వేతా మహంతి, డీఎంఈ రమేశ్రెడ్డి, డీహెచ్ శ్రీనివాసరావు, టీవీవీపీ కమిషనర్ అజయ్కుమార్, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.