నిజాంసాగర్, జూలై 23: జుక్కల్ నియోజకవర్గంలోని ప్రతి మండలంలో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించాలని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పిలుపునిచ్చారు. వేడుకల్లో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో సూచించారు.
ప్రతి మండల కేంద్రంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేయకుండా, మొక్కలు నాటడం, పండ్ల పంపిణీ, అన్నదానం, సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహించి, జన్మదిన వేడుకలను విజయవంతం చేయాలని షిండే కోరారు.