Minister Harish Rao | హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చే అంశాన్ని త్వరలోనే పరిషరిస్తామని ఆర్థిక మంత్రి హరీశ్రావు హామీ ఇచ్చారు. ఇటీవల ఏర్పాటైన ‘ది తెలంగాణ జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ’ ప్రతినిధులతో గురువారం ఆయన ప్రగతిభవన్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సొసైటీ సభ్యత్వ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈసారి కూడా అధికారం తమదేనని, మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు కాగానే జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కేటాయింపు అంశాన్ని తొలి ప్రాధాన్యంగా తీసుకుంటామని మంత్రి హరీశ్రావు భరోసా ఇచ్చారు. కొత్త, పాత సొసైటీల్లోని సభ్యులందరికీ కలిపి ఒకేసారి ఇండ్ల స్థలాలను కేటాయించే దిశలో తాను, మంత్రి కేటీఆర్ కలిసి సీఎం కేసీఆర్తో మాట్లాడుతామని చెప్పారు.
జిల్లాల్లో ఇప్పటికే మెజారిటీ జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయించామని గుర్తుచేశారు. అదే క్రమంలో హైదరాబాద్లోని జర్నలిస్టులకు సైతం ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. కోర్టు కేసుల కారణంగా జర్నలిస్టుల ఇండ్ల సమస్యను పరిషరించడం ఆలస్యమైందని తెలిపారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కోర్టు కేసు పరిషారం కోసం ప్రభుత్వం, సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో కృషి చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. సుప్రీంకోర్టులో అడ్వకేట్ను పెట్టి, ప్రభుత్వం తరఫున అఫిడవిట్ వేసి, తీర్పు జర్నలిస్టులకు అనుకూలంగా వచ్చేలా సహకరించామని పేర్కొన్నారు.