హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): ముస్లిం సమాజం బీఆర్ఎస్తో లేదనే విష ప్రచారానికి కాంగ్రెస్ తెరతీసిందని, ఇటువంటి కుట్రలను లౌకికవాదులు తిప్పికొట్టాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ నుంచి ముస్లిం సమాజాన్ని దూరం చేయడానికే బీజేపీతో సంబంధాలు ఉన్నాయని అసత్యప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన హైదరాబాద్లో జమాతుల్-ఉలేమా నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. సర్వమత సామరస్యం, సర్వజనహితమే లక్ష్యంగా బీఆర్ఎస్ పనిచేస్తున్నదని, తొమ్మిదిన్నరేండ్ల పాలనే అందుకు నిదర్శమని చెప్పారు. తెలంగాణలో మాదిరిగా మరే రాష్ట్రంలోనూ లౌకికవిలువలతో కూడిన పాలన సాగడం లేదని తెలిపారు. ముస్లిం స మాజం బీఆర్ఎస్ను ఆశీర్వదించాలని కోరా రు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి ఆరెస్సెస్ మూలాలు ఉన్నాయని ఆరోపించారు. నిర్మ ల్, గోషామహల్, దుబ్బాక, ముథోల్ సహా అనేక చోట్ల్ల బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం బలహీనమైన అభ్యర్థులను కాంగ్రెస్ పోటీలో దించిందని చెప్పారు. గత ఉప ఎన్నికల్లోనూ బీజేపీ, కాంగ్రెస్ లోపాయికారి ఒప్పందాలు చేసుకున్నాయని మండిపడ్డారు. తెలంగాణలో మాదిరిగా మరే రాష్ట్రంలోనూ లౌకికవిలువలతో కూడిన పాలన సాగడం లేదని ఆయన తెలిపారు.
బీఆర్ఎస్కు జమా తుల్-ఉలేమా మద్దతు
రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతు ఇస్తామని జమా తుల్-ఉలేమా తెలంగాణ విభాగం ప్రకటించింది. ముస్లిం సమాజ ఉద్దరణకు కేసీఆర్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసిందని కొనియాడింది. సర్వసమత సహజీవనానికి కేసీఆర్ నేతృత్వంలో జరుగుతున్న కృషి భవిష్యత్లోనూ కొనసాగాలని ఆ సం ఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గయాసుద్దీన్, జుబేర్ ఆకాంక్షించారు.