Minister Harish Rao | పార్లమెంట్ను రాష్ట్రపతి, సచివాలయాన్ని సీఎం ప్రారంభించటమే కరెక్టు. గవర్నర్ను రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజీ ద్వారా దేశ ప్రజాప్రతినిధులంతా ఎన్నుకొంటారు. పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని రాష్ట్రంలోని సచివాలయం ప్రారంభోత్సవంతో కొందరు పోలుస్తున్నారు. గవర్నర్కు రాష్ట్రపతికి ఉన్న తేడాను తెలుసుకోవాలి.
– మంత్రి హరీశ్రావు
మెదక్, మే 28 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీ తీరుతో ఫెడరల్ స్ఫూర్తి దెబ్బతిన్నదని, చెప్పేదేమో టీమిండియా.. చేసేదేమో తోడో ఇండియా అన్నట్టు ఉన్నదని మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. నీతి ఆయోగ్కు కేంద్రం ఏం విలువ ఇచ్చిందని, దానికి ఏమైనా ఇజ్జత్ ఉన్నదా? మీటింగ్కు వస్తే ఏం లాభమని ప్రశ్నించారు. ఆదివారం దశాబ్ది ఉత్సవాలపై మెదక్ కలెక్టరేట్లో ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశమయ్యారు. తర్వాత హరీశ్రావు మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ నీతి ఆయోగ్ మీటింగ్కు ఎందుకు రాలేదని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అడిగారని, కేసీఆర్తోపాటు మరో 10 రాష్ర్టాల సీఎంలు ఆ మీటింగ్కు పోలేదని గుర్తుచేశారు.
నీతిఆయోగ్ మిషన్ భగీరథ, మిషన్కాకతీయను మెచ్చి రూ.24 వేల కోట్లు తెలంగాణకు ఇవ్వాలని సూచిస్తే 24 పైసలూ ఇవ్వలేదని, నీతి ఆయోగ్ ప్రతిష్ఠను కేంద్రం మంటగలిపిందని ధ్వజమెత్తారు. ఆ నిధులు ఇచ్చి ఉంటే సమావేశానికి వచ్చేవాళ్లమేమోనని పేర్కొన్నారు. అప్పులు, ఔటర్ రింగ్రోడ్డుపై మాట్లాడే హకు కిషన్రెడ్డికి లేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రతి అప్పుకు లెక ఉన్నదని, తిరిగి చెల్లించే సత్తా ఉన్నదని వెల్లడించారు. కేంద్రం అప్పులపై కిషన్రెడ్డి ఆలోచించాలని, కేంద్రం జీడీపీ రుణాల నిష్పత్తిని ఎప్పుడో దాటిందని, తెలంగాణ అప్పులు పరిమితుల్లోనే ఉన్నాయని వివరించారు. మీరు అమ్మిన ప్రభుత్వ రంగ సంస్థలు ఎన్ని? మూసేసిన కంపెనీలు, ఊడదీసిన ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఉత్సవాలు చేసే హక్కు బీజేపీకి లేదు
బీజేపీ ప్రత్యేకంగా ఉత్సవాలు జరుపుతుందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ప్రకటించారని, ఉత్సవాలు జరిపే హక్కు వారికి లేదని మంత్రి హరీశ్రావు చెప్పారు. ఆనాడు రాజీనామా చేద్దామంటే యెండల లక్ష్మీనారాయణను ముందుకు తోసి గడ్డమీద కూర్చున్న వ్యక్తి ఈ రోజు ఉత్సవాల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉన్నదని పేర్కొన్నారు. ఈ రోజు తెలంగాణ ఉత్సవం జరిపి.. ఏమని జెండా ఎగరేస్తారని ప్రశ్నించారు. రాష్ట్రం రాగానే తెలంగాణలో 7 మండలాలు తీసుకున్నారని, లోయర్ సీలేరు పవర్ ప్లాంట్ను దకకుండా చేసి ఇప్పుడు ఉత్సవాలు ఎలా జరుపుతారని నిలదీశారు.
పార్లమెంట్లో చేసిన చట్టాన్ని తుంగలో తొకి తెలంగాణకు రైల్వే కోచ్ఫ్యాక్టరీ ఇవ్వలేదని, బయ్యారంలో ఉకు ఫ్యాక్టరీ పెట్టలేదని, గిరిజన వర్సిటీ ఇవ్వలేదని, ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ పెట్టలేదని రాష్ట్రంలో ఏ అభివృద్ధి చేయకుండా ఉత్సవాలు ఎలా నిర్వహిస్తారని మండిపడ్డారు. ఏపీని ఒప్పించి విభజన సమస్యను పరిషరించలేదని, కృష్ణా నది జలాల వాటా తేల్చడానికి 9 ఏండ్లు సరిపోదా అని నిలదీశారు. వెనుకబడిన సంక్షేమ నిధి నుంచి హక్కుగా రావాల్సిన రూ.1,350 కోట్ల నిధులు ఇవ్వట్లేదని, నచ్చిన, రాష్ట్రాలకు స్పెషల్ ప్యాకేజీలు సైతం ఇస్తున్నారని.. మీకు ఉత్సవాలు చేసే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. నూతన పార్లమెంట్ భవనానికి అంబేదర్ పేరు పెట్టాలనే తమ డిమాండ్పై ఒక బీజేపీ నాయకుడు ఎందుకు మాట్లాడటంలేదని హరీశ్రావు నిలదీశారు. తాము సచివాలయానికి అంబేదర్ పేరు పెట్టామని గుర్తుచేశారు.
అమరుల త్యాగాలను తక్కువ చేస్తున్న కాంగ్రెస్
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను వైభవంగా జరపాలని ప్రభుత్వం నిర్ణయించడంతో కాంగ్రెస్, బీజేపీలకు మింగుడు పడటం లేదని మంత్రి హరీశ్రావు ఆరోపించారు. దశాబ్ది ఉత్సవాలను ఎవరు వ్యతిరేకించినా ప్రజలు ఊరుకోరని, ఇది ప్రజల పండుగని చెప్పారు. రాష్ట్ర అవతరణను వ్యతిరేకించడమంటే తెలంగాణ పోరాటయోధులు, ఉద్యమకారులు, అమరవీరులను అవమానించినట్టేనని చెప్పారు. కాంగ్రెస్ ఆనాడు ఉద్యమంలో కలిసిరాలేదని, నేడు అభివృద్ధిలో కలిసి రావటంలేదని విమర్శించారు. అవతరణ ఉత్సవాలను నిర్వహించబోమని కాంగ్రెస్ అనటం తెలంగాణ జాతిని, రాష్ట్ర అవతరణను తకువ చేసి చూడటం, అమరుల త్యాగాలను కించపరచడమేనని పేర్కొన్నారు. రాష్ట్ర ఏర్పాటు ఒక ఎత్తయితే, తొమ్మిదేండ్ల అభివృద్ధి మరో ఎత్తని పేర్కొన్నారు. జూన్ 2 రాష్ట్ర ప్రజలకు స్వాతంత్య్ర దినం లాంటిదని వెల్లడించారు.