హైదరాబాద్ : సీనియర్ శాసనసభ్యులు సాయన్న మృతి పట్ల మంత్రి హరీశ్ రావు సంతాపం వ్యక్తం చేశారు.గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సాయన్న ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
సహచర శాసనసభ్యుడు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మరణం బాధాకరమని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర అటవిశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబసభ్యులకు భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని పేర్కొన్నారు.