Harish Rao | తెలంగాణ రాష్ట్రం( Telangana State )లో ఫసల్ బీమా యోజన( PMFBY ) అమలు చేయాలని అడుగుతున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్( Bandi Sanjay )పై రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు( Harish Rao ) నిప్పులు చెరిగారు. గుజరాత్లో ఫసల్ బీమా యోజన పథకం ఎందుకు అమలు చేయడం లేదని సంజయ్ను హరీశ్రావు సూటిగా ప్రశ్నించారు. ఇటీవల కురిసిన వడగళ్ల వానకు పంటలు దెబ్బతినడంతో.. బాధిత రైతులకు సీఎం కేసీఆర్( CM KCR ) ఎకరాకు రూ. 10 వేల నష్ట పరిహారం ప్రకటించి, మరోసారి రైతుబిడ్డ అని నిరూపించుకున్నారని హరీశ్రావు పేర్కొన్నారు.
ముందు ప్రధాని మోదీ( PM Modi ) సొంత రాష్ట్రం గుజరాత్( Gujarat )లో ఫసల్ బీమా యోజన ఎందుకు అమలు చేయడం లేదో చెప్పగలవా..? అని సంజయ్ను హరీశ్రావు అడిగారు. దేశంలోని 10 రాష్ట్రాలు, 5 కేంద్ర పాలిత ప్రాంతాలు ఫసల్ బీమాను వ్యతిరేకిస్తున్నాయని పార్లమెంట్( Parliament ) సాక్షిగా బీజేపీ కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్( Narendra Singh Thomar ) చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. దీనిని బట్టే ఆ పథకంతో రైతులకు పెద్దగా ఉపయోగం లేదని అర్థం కావడం లేదా..? అని ప్రశ్నించారు.
పంట నష్టపోయిన రైతులకు అండగా నిలిచేందుకు సీఎం కేసీఆర్ ఎకరాకు రూ. 10 వేల సాయం చొప్పున, రూ. 228 కోట్లు ప్రకటించి రైతు బిడ్డనని మరోసారి నిరూపించుకున్నారు. బీజేపీ నేతలకు ఇది చిన్న సాయంగా కనిపించడం దురదృష్టకరం. దేశంలో ఇంకెక్కడైనా ఇంతకన్నా ఎక్కువ సాయం చేసినట్టు నిరూపించగలరా? అని అడిగారు.
నాడు అన్నదాత ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పి, నేడు అదానీ ఆదాయాన్ని డబుల్ చేశారని హరీశ్రావు పేర్కొన్నారు. అనునిత్యం రైతులను క్షోభకు గురి చేస్తూ, నల్ల చట్టాలు తెచ్చి రైతులను బలి చేసిన చరిత్ర మీది. వ్యవసాయాన్ని పండుగలా చేసి, రైతును రాజుగా చేసిన ఘనత మాది. సాగు, రైతు సంక్షేమం గురించి బీజేపీ నేతలు మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించడమేనని హరీశ్రావు పేర్కొన్నారు.
తెలంగాణలో ఫసల్ బీమా అమలు చేయాలని అడుగుతున్న బండి సంజయ్..
ముందు ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో ఎందుకు అమలు చేయడం లేదో చెప్పగలవా..? దేశంలోని 10 రాష్ట్రాలు, 5 కేంద్ర పాలిత ప్రాంతాలు ఫసల్ బీమాను వ్యతిరేకిస్తున్నాయని పార్లమెంట్ సాక్షిగా బీజేపీ కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్… pic.twitter.com/EwS8ZgDjdI
— Harish Rao Thanneeru (@BRSHarish) March 24, 2023