వరంగల్ రూరల్ : నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పరామర్శించారు. ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి తండ్రి రాజిరెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా, శుక్రవారం నల్లబెల్లి మండల కేంద్రంలో రాజిరెడ్డి చిత్రపటానికి మంత్రి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంత్రి వెంట టీఆర్ఎస్ నేతలు, తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
యాదాద్రి ఆలయం అత్యద్భుతం : ఏపీ మంత్రి పేర్ని నాని
విమర్శల పాలవుతున్న ప్రగ్యా ఠాకూర్.. ఎందుకంటే.?
పేదలను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యం
సానియా మీర్జా, షోయెబ్ జంటకు యూఏఈ గోల్డెన్ వీసా జారీ