కరీంనగర్ : కోట్లాదిమంది బంగారు భవిష్యత్తుకి..బాటలు వేసిన ఘనత ఉపాధ్యాయ వృత్తిది. ఉపాధ్యాయ వృత్తి వెలకట్టలేనిదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. టీచర్స్ డే సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలను ప్రదానం చేసి సన్మానించి మాట్లాడారు. ఉపాధ్యాయుడు లేకపోతే విద్య లేదు.. క్రమశిక్షణ లేదన్నారు. సమాజం సన్మార్గంలో నడుస్తుందంటే దానికి ఉపాధ్యాయులే కారణమని పేర్కొన్నారు. సమాజంలో ఉపాధ్యాయ వృత్తికి ఉన్న గుర్తింపు చాలా గొప్పది.
సమైక్య పాలనలో ఉపాధ్యాయులు లేక పాఠశాలలో వసతులు లేక విద్యావ్యవస్థ కుంటుపడింది. స్వయం పాలనలో సీఎం కేసీఆర్ విద్య, వైద్యానికి పెద్దపీట వేశారని గుర్తు చేశారు. మన ఊరు -మనబడి పేరుతో ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరిస్తున్నారు. గతంలో 19 గురుకులాలు7500 మందికి విద్యను అందించేవి. సీఎం కేసీఆర్ పాలనలో 365 గురుకులాలు వేలాది మంది విద్యార్థులకు విద్యను అందిస్తున్నాయని స్పష్టం చేశారు.
తెలంగాణ వచ్చిన తర్వాత విద్య వ్యవస్థలో పెను మార్పులు వచ్చాయని పేర్కొన్నారు. నిరుపేదలు సైతం విదేశాల్లో చదువుకునేందుకు ఓవర్సీస్ స్కాలర్షిప్స్ ఇస్తున్నాం. స్వయం పాలనలో కోట్లాది రూపాయలు తీసుకొచ్చి కరీంనగరాన్ని గొప్ప నగరంగా తీర్చిదిద్దామన్నారు. గతంలో ఇతర ప్రాంతాల వారు కరీంనగర్ రావాలంటే జంకల్సిన పరిస్థితిలు ఉండేవి. కరీంనగర్ అంటే బదిలీపై వచ్చేవారు, దాన్ని పనిష్మెంట్గా భావించేవారు . కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయి. కరీంనగర్ రావడానికి ఆసక్తిని చూపిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.