కరీంనగర్ : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగ అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఆదివారం కరీంనగర్ పట్టణంలో 24వ డివిజన్ కిసాన్ నగర్ కాళికామాత ఆలయం..రాంనగర్ మున్నూరు కాపు ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలంతా కులమతాలకు అతీతంగా ఎంతో సంతోషంగా ఈ బోనాల పండుగను జరుపుకుంటున్నారని తెలిపారు. ఆ అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రంలో సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమం లో నగర మేయర్ వై.సునీల్ రావు, గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ గౌడ్, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి , కార్పొరేటర్లు బోనాల శ్రీకాంత్, కుర్ర తిరుపతి, ఎడ్ల సరిత అశోక్, మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చల్ల హరిశంకర్, .మున్నూరు కాపు సంఘం గౌరవ అధ్యక్షుడు రాజేందర్ అధ్యక్షుడు నాంచారి రాజయ్య, ప్రధానకార్యదర్శి వేదంతం సత్యనారాయణ, ఉపాధ్యక్షులు చల్ల హరికృష్ణ, శ్రీరామ్ నరేందర్,కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.