కరీంనగర్ : బొందల గడ్డగా ఉన్న కరీంనగర్ను సీఎం కేసీఆర్(CM CR) కోట్లాది రూపాయలు వెచ్చించి గొప్పగా అభివృద్ధి చేశారని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్తి, మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula )అన్నారు. శుక్రవారం కరీంనగర్లో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాకముందు కరీంనగర్ ఎట్లా ఉందో ఇప్పుడు ఇలా ఉందో చూడాలి. కేసీఆర్ లేని తెలంగాణ ఊహించలేం. కాంగ్రెస్ దర్రిద పాలనలో అన్ని విధాలా మోసపోయామన్నారు.
సమైక్య పాలనలో ఆడబిడ్డలు నీళ్లకోసం అరిగోసపడ్డారన్నారు. మానేరు డ్యాం ఎండిపోతే బోరింగు కొట్టి కొట్టి జబ్బలు నొచ్చినా కానీ బిందె నిండకపోయేది. సీఎం కేసీఆర్ వచ్చాక నీటి కొరత తీరిందన్నారు. మండుటెండల్లో సైతం చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయని చెప్పారు. తెలంగాణ వ్యతిరేక శక్తులు ఏకమయ్యాయి. సీఎం కేసీఆర్ మరోసారి సమర శంఖం పూరించాలన్నారు. దొంగల చేతిలో తెలంగాణను పెట్టొద్దన్నారు. కరీంనగర్లో అన్ని స్థానాల్లోనూ బీఆర్ఎస్ను గెలిపిస్తామన్నారు.