కరీంనగర్, జనవరి 4 (నమస్తే తెలంగా ణ): బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తండ్రి మల్లయ్య(87) బుధవారం సాయంత్రం మృతిచెందారు. కరీంనగర్లోని మంత్రి స్వగృహంలో మల్లయ్య గుండెపోటు తో కన్నుమూశారు. మల్లయ్య మరణ వార్త తెలియగానే సీఎం కేసీఆర్ ఫోన్ చేసి మంత్రి కమలాకర్ను పరామర్శించారు. మంత్రిని ఓదార్చి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మల్లయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
మంత్రి కొ ప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్ తదితరులు మల్లయ్య భౌతికకాయానికి శ్ర ద్ధాంజలి ఘటించా రు. మల్లయ్య మృతి పట్ల స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, మండ లి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, మంత్రులు హరీశ్రావు, ఇంద్రకరణ్రెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి, జగదీశ్రెడ్డి, నిరంజన్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్, పువ్వాడ అజయ్, తలసాని శ్రీనివాస్యాదవ్, మహమూద్అలీ, శ్రీనివాస్గౌడ్, సబితాఇంద్రారెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమా ర్, ఎంపీలు నామా నాగేశ్వర్రావు, వద్దిరాజు రవిచంద్ర, బీసీ కమిషన్ సభ్యుడు కిశోర్గౌడ్ తదితరులు సంతాపం తెలిపారు.