కరీంనగర్ : హుజూరాబాద్ నియోజకవర్గంలో నూతన రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు మంజూరు చేశామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. సోమవారం నియోజకవర్గంలోని అన్ని మండలాల తహసీల్దార్లతో మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ఎంత మందికి నూతనంగా రేషన్ కార్డులు మంజూరు అయ్యాయని అడిగి తెలుసుకున్నారు. బియ్యం పంపిణీపై కూడా ఆరా తీశారు. నూతనంగా మంజూరైన రేషన్ కార్డులన్నింటినీ ప్రింట్ తీసి.. లబ్దిదారుల ఇంటికి వెళ్ళి ఇవ్వాలని సూచించారు. 5వ తేదీలోగా బియ్యం పంపిణీ కూడా చేపట్టాలని అధికారులను ఆదేశించారు.