కరీంనగర్: అగ్నిపథ్పై దేశ యువతలో ఉన్న వ్యతిరేకతను అర్థం చేసుకోకుండా ఇంకా రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం సరికాదని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సికింద్రాబాద్లో జరిగిన అల్లర్లపై బండి సంజయ్ మూర్ఖంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగిన పలు కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అగ్నిపత్ విషయంలో దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్న నిరసనలు అక్కడి ప్రభుత్వాలు చేపడుతున్నాయా అని బండి సంజయ్ని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వాలపై అబద్ధపు మాటలు మాట్లాడవద్దని సూచించారు.
రాష్ట్రంలో సోమవారం నాటికి ధాన్యం కొనుగోలు పూర్తి అవుతుందని మంత్రి తెలిపారు. రైతులందరికీ సోమవారం నాటికి డబ్బులను చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.