టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని తెలంగాణలోని ప్రతీ ఒక్కరూ ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో పాల్గొనాలని మంత్రి గంగుల కమలాకర్ కోరారు. గురువారం తన నివాసంలో గ్రీన్ ఇండియా ప్రతినిధులు సంకల్పించిన ముక్కోటి వృక్షార్చన కార్యక్రమ పోస్టర్ను మంత్రి ఆవిష్కరించారు. తెలంగాణను అభివృద్దిపథంలో తీసుకుపోతూ రాబోయే తరాలకు బంగారు తెలంగాణను అందించే లక్ష్యంతో ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ సంకల్పించిన హరితహారం దిగ్విజయమైందన్నారు. రాష్ట్రంలో రోజు రోజుకు పెరుగుతున్న పచ్చదనమే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ అన్నారు.
కరోనా సంక్షోభం ఆక్సీజన్ ఆవశ్యకతను తెలియజేసిందన్నారు. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్, సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారం ఇలాంటి ఉపద్రవాలనుండి మనల్ని కాపాడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రతినిధులు పాల్గొన్నారు.