హైదరాబాద్ : సీబీఐ విచారణపై బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు. శ్రీనివాస్ అనే వ్యక్తిని ఇటీవల సీబీఐ అరెస్టు చేసిందన్నారు. శ్రీనివాస్ పేరు విన్న కానీ కలువలేదన్నారు. కాపు సంఘంలో తిరిగే వాడని, ధర్మేందర్ అనే వ్యక్తి చెప్తే కలిసేందుకు.. అతను ఉన్న స్థలంలోకి వెళ్లి పరిచయం చేసుకున్నట్లు చెప్పారు. మున్నూరు కాపు కులంలో ఐపీఎస్ కదా అని గర్వంగా ఫీల్ అయ్యామని చెప్పానని, అతని భార్య కూడా ఐఏఎస్ అన్నారు కదా ఆమెను కూడా కాలవాలని చెప్పానన్నారు.
ఆ రోజు అతనితో దిగిన ఫొటో అధికారుల వద్ద ఉందని, ఆ రోజు మరుసటి రోజు గంట సేపు మామూలుగా మాట్లాడింది తప్ప అంతకు మించి ఏమీ లేదన్నారు. మంత్రి కదా అని తనను విచారణకు పిలిచారన్నారు. నా ఫొటోలు, కాల్ లిస్ట్ సీబీఐ వద్ద ఉన్నాయన్నారు. అన్ని ప్రశ్నలు అడిగారని, ఇద్దరం చెప్పింది ఒకటే ఉందన్నారు. మళ్లీ మళ్లీ పిలవడం బాగుండదని, కాసేపు ఉండండి అంటే ఆగామని.. తనను కేవలం 20 నిమిషాలే ప్రశ్నించారన్నారు. ఇప్పటి వరకు శ్రీనివాస్ ఎలాంటి పనులు అడుగలేదన్నారు. మా బావ ఎంపీ వద్ధిరాజు రవిచంద్రకు అతను పరిచయం అని, శ్రీనివాస్ ఇంట్లో పెళ్లికి మా బావను సహాయం చేయమని అడిగారని తెలిసిందని, రూ.15లక్షల విలువ ఉద్దెర ఇప్పించాడని, ఇదే విషయాన్ని విచారణ సమయంలో సీబీఐ అధికారులకు చెప్పినట్లు వివరించారు.
ఇంకా బకాయి అలాగే ఉందని, మాకు ఏ పని ఉన్నా అధికారులతో నేరుగా మాట్లాడుతామని, మధ్యవర్తులతో మాట్లాడాల్సిన అవసరం లేదని, బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఎవరిని కలవాల్సిన అవసరం లేదన్నారు. మమ్మల్ని ఎన్ని రకాల ప్రశ్నలు వేసినా నిజం ఇదేనని, శ్రీనివాస్తో గానీ.. మరెవరితో గానీ లావాదేవీలు జరుపలేదని స్పష్టం చేశారు. అతను కేవలం కులంలో గొప్పలు చెప్పుకొని తిరిగాడని, శ్రీనివాస్ అనే వ్యక్తి సీబీఐ అని చెప్పి ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదని విచారణలో స్పష్టమైందని మంత్రి తెలిపారు.