Minister Gangula | తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు కడుపుమంటతో కళ్లుమండి విష ప్రచారం చేస్తున్నాయని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మానేరు నదిపై నిర్మించిన తీగెల వంతెనను శనివారం మంత్రి మేయర్ సునీల్రావు, చల్లా హరిశంకర్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ తెలంగాణకు తలమానికమైన కేబుల్ బ్రిడ్జి వంతెనపై సాధారణంగా ఎండవేడికి తలెత్తిన చిన్న సమస్యను భూతద్దంలో చూపిస్తూ పెద్దదిగా చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపై విషం చిమ్ముతున్నారని ధ్వజమెత్తారు. కేబుల్ బ్రిడ్జి నిర్మాణంలో ఎలాంటి లోపాలు లేవని.. ప్రపంచంలోనే పెద్దపెద్ద ప్రాజెక్టులు నిర్మించిన టాటా సంస్థ నిర్మాణం చేపట్టిందన్నారు. పూర్తిస్థాయిలో నాణ్యతతో కేబుల్ వంతెన నిర్మాణం చేపట్టిందన్నారు.