కొత్తపల్లి, అక్టోబర్ 13 :ఈటల రాజేందర్కు దమ్ముంటే గతంలో ఆయన చెప్పినట్టుగా సీఎం కేసీఆర్పై గజ్వేల్లోనే పోటీ చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ సవాల్ విసిరారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంటలో శుక్రవారం జరిగిన బీఆర్ఎస్ యువజన సమ్మేళనంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి మీడియాతో మాట్లాడారు. హుజూరాబాద్, గజ్వేల్ నుంచి రెండు చోట్ల నుంచి పోటీ చేస్తానని బీజేపీ నేత ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై ఘాటు గా స్పందించారు. ఈటల రాజేందర్కు హు జూరాబాద్లో కూడా ఓటమి భయం పట్టుకున్నదని, అందుకే రెండు చోట్లా పోటీ చేస్తానని అంటున్నాడని దుయ్యబట్టారు.
దమ్ముం టే ఒక్క గజ్వేల్లోనే కేసీఆర్పై పోటీ చేయాలని సవాల్ విసిరారు. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా ఉన్నవారికి, భూ కబ్జాలు, మతతత్వ పార్టీలకు ఎట్టి పరిస్థితుల్లో అవకాశం కల్పించవద్దని సూచించారు. కాంగ్రెస్ బీ-ఫారాలు బీజేపీ ఆఫీసులో, బీజేపీ బీ-ఫారాలు కాంగ్రెస్ ఆఫీసులో తయారవుతున్నాయని ఎద్దేవా చేశారు. కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో పూ ర్తిగా విఫలమైందని అన్నారు. ఎన్నికల్లో ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి ఇప్పుడు ఆ పథకాలు అమలు చేయడానికి అక్కడి కాం గ్రెస్ సర్కార్ ఇబ్బందులు పడుతున్నదని చె ప్పారు.
ఇక్కడ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు ఎలా అమలు చేస్తారని? ప్రశ్నించారు. బీజేపీ తెలంగాణలో ఒక సీటు కూడా గెలుచుకొనే అవకాశం లేదని, ఇక ఈటల రాజేందర్ సీ ఎం ఎలా అవుతాడో ఆయనే చెప్పాలని అన్నా రు. బీఆర్ఎస్ పార్టీయే తమ భవిష్యత్తు అని ప్రజలు నమ్ముతున్నారని, సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో బీడు భూములన్నీ ఇప్పుడు పచ్చని పంటలతో నిండుగా కనిపిస్తున్నాయని, చెరువులు, కుం టలు నీటితో కళకళలాడుతున్నాయని అన్నా రు. ఆంధ్రాకు చెందిన కొందరు కాంగ్రెస్, బీజేపీ ముసుగులో వచ్చి పచ్చని తెలంగాణను చూసి ఓర్వలేక, కడుపు మంటతో ఇక్కడి సంపదను దోచుకొనే ప్రయత్నంలో భాగంగా ఆంధ్రాలో కలపాలని చూస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ కేసీఆర్ చేతిలో ఉంటే వాళ్ల పప్పులు ఉడకవని అన్నారు.