హైదరాబాద్ : భారత హరితవిప్లవ పితామహుడు, ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ మృతి పట్ల మంత్రి గంగుల కమలాకర్ సంతాపం వ్యక్తం చేశారు. యావత్ దేశానికి తన పరిశోధనలతో ఎంతో సేవ చేసారన్నారు. ఆయన కృషితో నేడు భారతదేశం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి దిశగా నడిపిస్తున్నదంటే దానికి కారణం ఆయన చేసిన కృషి ఫలితమేనని కొనియాడారు. అలాగే అధిక దిగుబడులు రాబట్టడం ద్వారా వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతాంగానికి ఆదాయం మెరుగు పడడంలో కూడా స్వామినాథన్ పరిశోధనలు తోడ్పడ్డాయాన్నారు. ఈ విషాద సమయంలో స్వామినాథన్ కుటుంబ సభ్యలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు.