హైదరాబాద్ : ప్రముఖ కవి, ప్రజా గాయకుడులు ప్రజా యుద్దనౌక గద్దర్ మృతి పట్ల బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గద్దర్ గా పేరొందిన విఠల్ కవిగా, గాయకుడిగా ఆట, పాటలతో లక్షలాది మంది అభిమానాన్ని చూరగొన్నారని, ప్రజల్లో చైతన్యం నింపారని మంత్రి గంగుల తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. గద్దర్ అకాల మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటని, ఆయన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అభిమానులకు తన ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలిపారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.