కరీంనగర్ : తెలంగాణ ప్రభుత్వం అన్ని పండుగలకు సమ ప్రాధాన్యం ఇస్తుందని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్లోని మానేరు డ్యామ్ సమీపంలోని బ్లెసింగ్ గాస్పెల్ మినిస్ట్రీస్ చర్చ్ను ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, మేయర్ సునీల్రావుతో కలిసి ప్రారంభించారు. అనంతరం జిల్లాకేంద్రంలోని ఎస్పీ బంగ్లా సమీపంలోని సీఎస్ఐ వెస్లీ కేథడ్రల్ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచశాంతి కోసం ఏసుక్రీస్తు జన్మించాడన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం అన్ని పండుగలకు ప్రాధాన్యం ఇస్తుందన్న మంత్రి.. క్రిస్మస్ను అందరూ సంతోషంగా జరుపుకునేలా కానుకలు పంపిణీ చేస్తుందన్నారు. భావితరాల అభ్యున్నతికి అందరూ కలిసిమెలిసి జీవించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నగర కార్పోరేటర్లు ఆకుల నర్మదా నర్సయ్య, వాల రమణారావు, ఐలేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.