కరీంనగర్ : కరీంనగర్ గ్రంథాలయ మాజీ చైర్మన్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడులు బోనాల రాజేశం అనారోగ్యంతో మృతి చెందడం పట్ల బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గురువారం రాంనగర్లోని ఆయన నివాసంలో రాజేశం భౌతిక కాయనికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బోనాల రాజేశం మృతి పార్టీకి తీరని లోటని మంత్రి తెలిపారు.. మంత్రి గంగుల వెంట మేయర్ వై.సునీల్ రావు, కార్పొరేటర్లు, తదితరులు ఉన్నారు.