వెల్గటూరు (ధర్మపురి) : అన్నివర్గాలకు న్యాయం చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. వెల్గటూరు మండలం ముక్కట్రావ్పేట గ్రామంలో శ్రీపాద ఎల్లంపల్లి నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ కింద 394 మందికి పునరావాస ప్యాకేజీ కింద రూ.3లక్షల చొప్పున చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముంపు గ్రామాల్లో 18 సంవత్సరాలు నిండిన యువకులకు రూ.2 లక్షల అందించిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు. ఇప్పటికీ 475 మంది యువకులకు అందించామన్నారు. సాంకేతిక సమస్యలు అధిగమించి మిగతా వారికి సైతం న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. 350 కుటుంబాలకు ఇంటికి రూ.3లక్షల చొప్పున పరిహారం ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో.. కేబినెట్ ఆమోదంతో నిధులు మంజూరు చేయించినట్లు మంత్రి గుర్తు చేశారు.