జనగామ : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పాలకుర్తిలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి వారిని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
అంతకు ముందు ఆలయ మర్యాదలతో అధికారులు, పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం ఘనస్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో పాలకుర్తి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి జరుగుతుందన్నారు. పాలకుర్తి ప్రాంతాన్ని పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. పాలకుర్తి, వల్మిడి, బమ్మెరల్లో ఇప్పటికే అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు.