హైదరాబాద్ : భారత తొలి ప్రధాని చాచా నెహ్రూ జన్మదినం సందర్భంగా బాలలందరికి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకార్రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నేటి బాలలే రేపటి పౌరులు అనే మాటలను నిజం చేస్తూ..సీఎం కేసీఆర్ రాష్ట్రంలో బాలల బంగారు భవిష్యత్ కోసం బాటలు వేస్తున్నారని తెలిపారు.
శిశువు గర్భంలో పడినప్పటి నుంచి పెరిగి పెద్దయ్యే వరకు ప్రతి దశలో తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలబడుతూ..అనేక కార్యక్రమాలు అమలు చేస్తూ వారి సమగ్ర వికాసానికి కృషి చేస్తోందన్నారు. దేశంలో కేజీ టు పీజీ వరకు ఉచిత విద్యను అందించే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు.