మహబూబాబాద్ : జిల్లాలోని పెద్ద వంగర మండలం గంట్లకుంట, పోచంపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..రైతులను ఇబ్బంది పెట్టకుండా, వారి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
రైతులు ధాన్యాన్ని బాగా ఎండబెట్టి, తేమ, తాలు లేకుండా జాగ్రత్త పడితే మంచి ధర వస్తుంన్నారు. ప్రత్యామ్నాయ పంటల పై అవగాహన కల్పించారు. వ్యవసాయంలో పంటల మార్పిడి సహజమేనని, అయితే లాభదాయక పంటలు వేసుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చి చివరకు ధాన్యం, బియ్యం కొనబోమని మొండి కేసిందని రైతులకు చెప్పారు.
తాను కూడా తన పొలాన్ని చెలకగా మార్చి ఆయిల్ పామ్ వేశానని చెప్పారు. తొర్రూరులో ఆయిల్ పామ్ పరిశ్రమను స్థాపిస్తామన్నారు. రైతులు ఈ యాసంగిలో వరికి బదులు ఇతర పంటలు వేయాలని సూచించారు.