వరంగల్ : జిల్లాలోని వరంగల్ ఎంజీఎం దవాఖానను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుక్రవారం సందర్శించారు. దవాఖానలోని ఐసీయూలో ఓ పేషెంట్ను ఎలుకలు కొరికిన నేపథ్యంలో మంత్రి దయాకర్ రావు డీఎంఈ రమేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ గోపితో కలిసి హాస్పిటల్లో రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.
సంఘటన జరిగిన ఐసీయూని, సానిటేషన్ నిర్వహణను పరిశీలించారు. బాధితుడు శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితిని ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్ ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోగికి మెరుగైన వైద్యం అందించాలని, శుభ్రత విషయంలో రాజీ పడొద్దని అధికారులను ఆదేశించారు.