హైదరాబాద్ : మాజీ ఎమ్మెల్సీ, ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్యను హైదరాబాద్లోని వారి నివాసంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli )పరామర్శించారు. ఆయనతో కొద్ది సేపు మాట్లాడి, ఆయన యోగ క్షేమాలు తెలుసుకున్నారు. తాను పాలకుర్తి బీఅర్ ఎస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసినట్లు చెప్పారు. త్వరలోనే వచ్చి కలుస్తామని మాట ఇచ్చారు. ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. కాగా, గతంలోనూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చుక్కా రామయ్యను కలిసి, వారి ఆశీర్వాదం తీసుకున్నారు. వయోభారంతో వచ్చిన సమస్యలతో సతమతం అవుతున్న రామయ్య త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.