హైదరాబాద్ : పీయూసీ చైర్మన్, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఖండించారు. బంజారాహిల్స్లోని ఎమ్మెల్యే నివాసానికి వెళ్లిన మంత్రి.. జీవన్రెడ్డి, ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. ఘటనకు సంబంధించిన పూర్వాపరాలను తెలుసుకున్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు చోటు లేదన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, నిందితుడిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ధైర్యంగా ఉండాలని జీవన్రెడ్డి కుటుంబానికి సూచించారు.