హైదరాబాద్ : తెలంగాణ వైతాళికుడు దాశరథి కృష్ణమాచార్య ( Dasarathi Krishnamacharya ) జయంతి సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli) శనివారం నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ వైతాళికులను గౌరవించుకోవడం అందరి కర్తవ్యమని అన్నారు.
నేటి యువత దాశరథిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని సగర్వంగా ప్రకటించి, తెలంగాణలో ఉద్యమ చైతన్యం కలిగించిన గొప్ప కవి (Telangana poet ) , ఉద్యమకారుడు దాశరథి కృష్ణమాచార్యులు అని అన్నారు. అగ్నిధార పేరుతో తెలంగాణ ప్రజలను జాగృతం చేశారని వెల్లడించారు.
దాశరథి సాహిత్య రంగంలో చేసిన సేవలను గుర్తించి తెలంగాణ ప్రభుత్వం ఆయన జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తుండడం గర్వకారణమని పేర్కొన్నారు. దాశరథి పేరున అవార్డును అందించడం ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR ) కు ఆయన పట్ల ఉన్న గౌరవానికి నిదర్శనమన్నారు.