మహబూబాబాద్ : దేశాన్ని సుదీర్ఘకాలం పాటు పాలించిన కాంగ్రెస్, బీజేపీ పాలన వల్ల దేశం వెనుకబాటుకు గురయిందని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు(Minister Errabelli ) విమర్శించారు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. ఆ ప్రభుత్వాల పాలనలో దేశంలో ఆకలి, దుర్భిక్షం మరింత ఎక్కువ అయ్యాయని ఆరోపించారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన అనతికాలంలోనే తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR) రాక కోసం దేశ ప్రజలంతా ఎదురు చూస్తున్నారని అన్నారు. ‘ దేశానికి కావాల్సింది గుజరాత్ మోడల్ కాదు. తెలంగాణ మోడల్(Telangana Model) కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని ’ ఆయన తెలిపారు.‘ రైతులకు ఇంతగా మేలు చేస్తున్న ప్రభుత్వం ఎక్కడా లేదు. రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన యవుసం ఎక్కడా బాగుపడలేదని ’ పేర్కొన్నారు.
ఈ సమ్మెళనంలో మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మహిళలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ఎర్రబెల్లి ట్రస్టు చైర్ పర్సన్ ఎర్రబెల్లి ఉషా దయాకర్రావు, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు .