వరంగల్ అర్బన్ : వరంగల్లోని కాకతీయ మెడికల్ కళాశాలలో 250 పడకలతో అన్ని వసతులు కల్పించడం కోసం నిధులు విడుదల చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేయడం పట్ల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రస్తుతం కరోనా పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వరంగల్ సమీప జిల్లాల్లోని నాన్ కోవిడ్ రోగులకు కార్పొరేట్ స్థాయిలో వైద్య సదుపాయాల లభిస్తాయని మంత్రి తెలిపారు.
వరంగల్లోని కాకతీయ మెడికల్ కళాశాల ఆవరణలో 150 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన సూపర్ స్పెషాలిటీ దవాఖానలో ఇటీవల తాత్కాలికంగా ఓపీ సేవలను ప్రారంభించామని మంత్రి తెలిపారు.