మహబూబాబాద్ : లంబాడీల సంస్కృతిలో తీజ్ పండుగకు ఎంతో ప్రాధాన్యం ఉందని, యువతులు అత్యంత గొప్పగా జరుపుకునే ఈ పండుగ ప్రత్యేకతను జనాల్లోకి తీసుకువెళ్లాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తీజ్ ఉత్సవాల్లో భాగంగా తొర్రూరు మండలం హచ్ తండాలో లంబాడీలు ఏర్పాటు చేసిన మొలకెత్తిన గోధుమ గింజలు, శనగ గింజలను పరిశీలించారు. వారితో కలిసి తీజ్ పండుగ ప్రాధాన్యతను తెలుసుకున్నారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. పండగలు వేటికవే ప్రత్యేకమైనవని, సంస్కృతులు, సంప్రదాయాలను బట్టి ఆయా పండుగలు నిర్వహించుకుంటారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ మన సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేశారన్నారు. బీఆర్ఎస్ పాలనలోనే దేవాలయాలు అభివృద్ధి చెందాయని పేర్కొన్నారు. ప్రజలంతా కలిసిమెలసి పండుగలు జరుపుకోవాలని సూచించారు. మంత్రి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.