హైదరాబాద్ : హబ్సిగూడలోని తన స్వగృహంలో మృతి చెందిన ఆల్ ఇండియా వెలమ సంఘం మ్యారేజీ బ్యూరో చైర్మన్ తిరుపతి పోతన్ రావు భౌతికకాయం వద్ద పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సంతాపాన్ని తెలిజేశారు.