హైదరాబాద్ : ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చిత్రపటానికి పూల మాల వేసి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నివాళులు అర్పించారు. ఆదివారం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం శ్రీకాళహస్తిలో బొజ్జల కుటుంబ సభ్యులను పరామర్శించారు. బొజ్జల మరణం పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు.
ఆయనతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బొజ్జల గోపాలృష్ణారెడ్డి అంటే తనకు ఎంతో గౌరవమని, ఇద్దరం దాదాపు ఒకేసారి రాజకీయ జీవితాన్ని ప్రారంభించామన్నారు.
శ్రీకాళహస్తి నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బొజ్జల, ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ హయాంలో అటవీశాఖ మంత్రిగా, ఆ తర్వాత ఐటీ శాఖ మంత్రిగా పనిచేసారన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని ఆ భగవంతుని ప్రార్థించారు.