వరంగల్ : బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ పాలకుర్తి నియోజకవర్గం అభ్యర్థి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli) అన్నారు. జిల్లాలోని రాయపర్తి మండలం రాగన్నగూడెంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అమల్లోకి తెచ్చిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.
కండ్ల ముందు జరిగిన అభివృద్ధి చూసి ఆలోచన చేయాలన్నారు. బీఆర్ఎస్తోనే రాష్ట్రం సుభిక్షింగా ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణకు అన్యాయం చేసిందే కాంగ్రెస్ పార్టీ అన్నారు. మరోసారి తనను ఆశీర్వదించాలని కోరారు. మంత్రి వెంట బీఆర్ఎస్ స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు కార్యకర్తలు ఆయన వెంట ప్రచారంలో పాల్గొన్నారు.