యాదాద్రి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli Dayakar), భువనగిరి ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి తో కలిసి శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం అర్చకులు మంత్రి, ఎమ్మెల్యేను స్వామి వారి పట్టు వస్త్రాలతో ఆశీర్వచనం అందించారు.
ప్రతిపక్షాలు చీటికి మాటికి దేవాలయాల పేర్లు చెప్పి, సందర్శించి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని దేవాలయాలను అపవిత్రం చేస్తున్నారని మండి పడ్డారు. ప్రతిపక్షాలకు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. సీఎం కేసీఆర్ స్ఫూర్తి తో తాను తన పాలకుర్తి నియోజకవర్గం లోని పలు దేవాలయాలను అభివృద్ధి పరుస్తున్నానని చెప్పారు.