హైదరాబాద్ : ప్రత్యేక తెలంగాణ ఉద్యమకారుడు, సాహితీవేత్త వేలపాటి రాంరెడ్డి (85) ఆకస్మిక మృతి పట్ల పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సంతాపాన్నితెలిపారు. 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఆయన చురుగ్గా పాల్గొన్నారని మంత్రి తెలిపారు. అనంతరం మలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా ఆయన పాల్గొన్నారని మంత్రి తెలిపారు.
కవి, సాహితీవేత్తగా వేలపాటి రాంరెడ్డి ఎన్నో రచనలు చేశారని మంత్రి తెలిపారు. సాహితీవేత్తగా, కవిగా తెలుగు భాషలో పలు రచనలు చేసినందుకుగాను 2017 సంవత్సరంలో రాష్ట్ర అవిర్భావం సంధర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ సాహితీవేత్త పురస్కారాన్ని అందించి గౌరవించిందని మంత్రి తెలిపారు.
వేలపాటి రామ్రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
కరోనాతో మేడారం పూజారి సమ్మారావు మృతి
ఆకతాయిలను ఐసోలేషన్కు పంపించిన పోలీసులు
అడవి శ్రీరాంపూర్లో కరోనాతో భార్యాభర్తలు మృతి
రైతులకు పనిముట్లను అందజేసిన మంత్రి అల్లోల
లాక్ డౌన్ కేసులు 11,746 : ఎస్పీ వెంకటేశ్వర్లు
మేడారం పూజారి మృతిపట్ల మంత్రి సత్యవతి సంతాపం