హైదరాబాద్ : కిడ్నీ సంబంధిత సమస్యలతో నిమ్స్ లో చికిత్స పొందుతున్న బలగం సినిమా(Balagam movie) మొగిలయ్య ను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli) శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా మొగులయ్య (Mogulayya)కు మెరుగైన వైద్యం అందించాలని నిమ్స్ వైద్యుల(Nims Hospital)కు ఆదేశించారు.
ఎన్నో కుటుంబాలను కలుపుతున్న బలగం సినిమాలో ‘ నా తోడుగా నా తోడు ఉండి’ అనే పాట పాడిన బుడగ జంగాల కళాకారుడు,వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. సీఎం కేసీఆర్(CM KCR) ఆదేశాల మేరకు మొగిలయ్య వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని, మంచి వైద్యం అందిస్తున్నామని పేర్కొన్నారు. మొగిలయ్య ను కలిసిన వారిలో బీఆర్ఎస్ నాయకులు సాంబారి సమ్మారావు, బుడిగ జంగాల సంఘం నాయకుడు చింతల యాదగిరి, సీఎం ఓ ఎస్డీ డాక్టర్ గంగాధర్ తదితరులు ఉన్నారు.