హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి రెండు దశాబ్దాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా..నవంబర్ 15న వరంగల్లో విజయ గర్జన సభ నిర్వహించనుంది. నగర సమీపంలో భారీ ఎత్తున సభను నిర్వహించి విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు శ్రీకారం చుట్టాయి.
అందులో భాగంగా నగరంలో శాయంపేట, భట్టుపల్లి, కరీమాబాద్, తిమ్మాపురం శివార్లలోని ఖాళీ స్థలాలను ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్భాస్కర్, వరంగల్ మేయర్ గుండు సుధారాణితో కలిసి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మంగళవారం పరిశీలించారు.
10 లక్షల మందితో భారీ ఎత్తున సభను నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎలాంటి అటంకాలు కలుగకుండా అన్ని హంగులతో సభ విజయవంతం కావడానికి అనువైన స్థలాన్ని పరిశీలిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ స్థాపించి 20 ఏ0డ్లు పూర్తవుతున్న సందర్భంగా పార్టీ సాధించిన విజయాలను, ప్రభుత్వం సాధించిన ప్రగతిని సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులు, ప్రజలకు నివేదిస్తారని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Crime news |మోసాలకు పాల్పడుతున్న దొంగ బాబా అరెస్ట్
T20 World Cup | దుబాయ్లో కలిసిన ధోనీ, గేల్.. ఫొటో వైరల్
Singur project | సింగూరు ప్రాజెక్టుకు పెరిగిన వరద