వరంగల్ మార్చి 13 : జిల్లాలోని నర్సంపేట మండలం చిన్నగురిజాల గ్రామంలోని చెరువులో జారిపడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోవడం పట్ల పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర దిగ్భ్రాంతికి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మరణించిన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. వివరాల్లోకి వెళ్తే..చిన్నగురిజాల గ్రామానికి చెందిన కృష్ణమూర్తి (65) అనే వ్యక్తి కాళ్లు కడుక్కునేందుకు మనుమడు లక్కీ (12)తో కలిసి చెరువులోకి దిగాడు.
ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ఇద్దరు అందులోనే పడిపోయారు. అక్కడే కృష్ణమూర్తి తనయుడు నాగరాజు (34) విషయాన్ని గమనించి తండ్రి, కొడుకునే కాపాడేందుకు చెరువులోకి దిగాడు. చెరువులో నీటమునగడంతో ముగ్గురు ఊపిరాడక మృతి చెందారు. చెరువులో పడి ముగ్గురు మృతి చెందడంతో స్థానికంగా విషాదం అలుముకున్నది.