ములుగు : శ్రమలో, సంపద సృష్టిలో, సాంస్కృతిక వికాసంలో మహిళల కృషిని తెలిపే పండుగ బతుకమ్మ అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త ప్రొ. సురేపల్లి సుజాత తాడ్వాయి జూనియర్ కళాశాల బాలికలకు అందించిన బతుకమ్మ దుస్తుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. తాడ్వాయి అరణ్యం జీవ వైవిధ్య కేంద్రమన్నారు.
తనకు తీరొక్క పూలతో స్వాగతము పలికిన విద్యార్థినిలను ఆశీస్సులందించారు. అలాగే అస్నాల శ్రీనివాస్ రాసిన బత్కమ్మ విశిష్ఠతను తెలియచేసే ‘తెలంగాణ బతుకు పండుగ’ వ్యాసాన్ని ఆవిష్కరించారు. ఇంటర్ విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు.
అనేక సేవా సంస్థలు, దాతల ద్వారా తాడ్వాయి ఏజెన్సీలో విద్యా వికాసానికి తోడ్పడుతున్న ప్రిన్సిపాల్ అస్నాల శ్రీనివాస్ రాష్ట్ర ఉత్తమ ప్రిన్సిపాల్ పురస్కారం పొందిన సందర్భంగా ఘనంగా సన్మానించారు.
సమావేశంలో జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్, వైస్ చైర్మన్ బడే నాగజ్యోతి, మార్కెట్ చైర్మన్ రమణయ్య, యువజన నాయకుడు సలేందర్, అధ్యాపకులు రాములు నాయక్, సంధ్య, కిషన్, మూర్తి, రాజు, శ్వేత, రాజ్ కుమార్, శ్రీలత, అశోక్ పాల్గొన్నారు.